సమాచార హక్కు చట్టం అంటే:
సహ చట్టం సెక్షన్ 2(జే)ప్రకారం పాలనలో పార దర్శకత ,జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగం అదుపులో వున్న సమాచారాన్ని పౌరులు పొందడం.
1.సమాచారం అంటే: ప్రభుత్వకార్యాలయాల్లోనిసహచట్టం,సెక్షన్2(ఎఫ్)మేరకురికార్డులు,పత్రాలు,మేమోలు,ఈమైల్,అబిప్రాయాలు,ఆదేశాలు,ఒప్పందాలు,పత్రికప్రకటనలు,ఒప్పందాలు,కాంట్రాక్టులు,సర్క్యులర్లు,ఉత్తర్వులు,నమూనాలు,సలహాలు,కమ్ప్యూటర్లలో నిక్షిప్తంఅయన డేటా,సీడీ,డీవీడీ,ప్లాపి,మరే ఇతర రూపంలో వున్న సమా చారం.
2. సమాచారాన్ని ఎవరిని అడగాలి అంటే
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 5(1) మేరకు ప్రజా సమాచార అదికారి/సహాయ ప్రజా సమాచార అదికారి వుంటారు. సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలి.అతనికి మనకు కావాల్సిన సమాచారాన్ని దరకాస్తు చేసుకొని పొందవచ్చు.
3.దరఖాస్తు నమూనా వుందా?
సహ చట్టం మేరకు దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు. తెల్లకాగితంపై సమాచారం కోసం విన్నపం అని వ్రాసి ఇస్తే చాలు.
4.దరకాస్తు రుసుము వివరాలు:-
గ్రామస్థాయి సంస్థలకు---ఉచితం
మండలస్థాయిలో-----5/-రూ:,
జిల్లా,రాష్ట్ర,కేంద్ర స్థాయి సంస్థలకు :-------------10/రూ: చెల్లించాలి.
5.ధరకాస్తు రుసుము ఎలా చెల్లించాలి
జీ.ఓ.ఎంఎస్.నెం:740,సహచట్టం,సెక్షన్7(3)మేరకునగదు,ఇండియన్పోస్టల్ఆర్డర్(postalorder),బ్యాంకుచెక్కు,డి.డి,ఛలాన,రూపంలోచెల్లించవచ్చు.
6.దరకాస్తు రుసుం ఉచితం::-
సహ చట్టం,సెక్షన్ 7(5)మేరకు దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి ఉచితం. రేషన్ కార్డు వున్న వారికి వర్తిస్తుంది.
7.సమాచారం ఎందుకు అని అడిగే అధికారం ఎవరికి లేదు:
సహ చట్టం,సెక్షన్ 6(2) ప్రకారం కోరుతున్న సమాచారం ఎందుకని దరకాస్తుదారిని అడిగే అధికారం ఎ అదికారికి లేదు.
8. సమాచారం ఇవ్వటకు గడువు వుందా:
సహ చట్టం-2005,సెక్షన్ 7(1)మేరకు 30రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి.
9.అత్యవసర సందర్భంలో ఇవ్వాల్సిన సమాచారం::-
వ్యక్తి స్వేచ్ఛ,జీవించే హక్కులకు భంగం కలిగే సందర్భంలో 48గంటల్లో ఇవ్వాలి.
10. సమాచారం ఇవ్వకుంటే::-
సహచట్టం,సెక్షన్19(1) మేరకు ప్రభుత్వ కార్యాలయం యొక్క వున్నత అదికారికి మొదటి అప్పీలు చేయాలి.30-45రోజుల్లో సమాచారం ఇవ్వాలి.
11.అప్పటికి సమాచారం రాకుంటే::-
90రోజుల వ్యవదిలోరాష్ట సమాచార కమీషన్కు, సెక్షన్ 19(3)మేరకు అప్పీలు చేయాలి:గడువు సహ కమిషన్ నిర్దేశిస్తుంది.
12. సమాచారం ఇవ్వని అదికారులకు జరిమానా, శిక్షలు ఏమైన వున్నాయా:-
దరకాస్తు తీసుకోవడానికి నిరాకరించిన,ఎక్కువ దరకాస్తు రుసుం కోరిన,తెలిసి అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చిన, సమాచారం నిరాకరించడం, కోరిన సమాచారాన్ని ద్వంసం చేయడం,సమాచారం ఇవ్వడాన్ని అడ్డుకోవడం ఇవ్వన్నీ నేరాలే వీటికి పాల్పడిన ప్రజా సమాచార అదికారికి సహ చట్టం,సెక్షన్ 20(1)మేరకు రోజుకు 250నుండి 25,000వేల వరకు జరిమానా విధించే అదికారం సహ కమీషన్కు వున్నది. తరచూ సహ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అదికారులకు సెక్షన్20(2) మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు.
13.నిర్దిష్ట వ్యవధి దాటిన సమాచారం ఉచితంగా ఇవ్వాలి::-
సహ చట్టం,సెక్షన్ 7(6)మేరకు 30రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి.
14.స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారం::
సహ చట్టం,సెక్షన్ 4(1)(బి)మేరకు ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విధులు,భాద్యతలు,విధినిర్వహనలో పాటించే సూత్రాలు,జవాబుదారీతనం,పారదర్శకతకు వున్న మార్గాలు,ఉద్యోగులు వివరాలు ,వారి నెలవారి జీత భత్యాలు,బడ్జెట్ కేటాయింపు,రికార్డుల పట్టికలు,రాయితీల వివరాలు,పీఐఓల వివరాలు,సలహా సంఘాలు తదితర వాటికి సంబందించిన 17 అంశాల సమాచారం ఎవరూ అడుగక ముందే స్వచ్ఛందంగా వెల్లడించాలి.
15.నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిందే::-
సహ చట్టం,సెక్షన్ 4(1)(సి)మేరకు ముఖ్యమైన విధానాలు రూపొందించే టపుడు,ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలు ప్రకటించే టపుడు వాటికి సంబందించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.అంటే కొత్త చట్టాలు తెచ్చే ముందు, ఉన్నవాటికి సవరణలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.
16. రికార్డుల తనిఖీ చేసే అదికారం ఎవరికైన ఉంది:
దరకాస్తు చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోన్ని అన్ని రికార్డులను,చేపడుతున్న అభివృధి కార్యక్రమాలను అధికారుల సమక్షంలో పరిశీలించవచ్చు,(నిర్మాణ పనులు, ప్రజా సంక్షేమ పధకాల అమలు) కావలసిన రికార్డులను సహ చట్టం,సెక్షన్ 2(జె)(1)మేరకు తనిఖీ చేయవచ్చు.& సహ చట్టం, సెక్షన్ 2(జె)(2)మేరకు నకలు,ఫోటో,వీడియో పొందవచ్చు ,అయీతే సమాచార ప్రతిపై పిఐఓ ధ్రువికరించి ఇవ్వాలి.
17.సమాచారం పొందుటకు చెల్లించాల్సిన రుసుములు వివరాలు::-
జీఓ ఎంఎస్.నం:454 మేరకు
A3/A4 కాగితానికి----2/-రూ..
ప్లాపికి -------------------50/-రూ.
సీడీ కి -----------------100/-రూ.
డి వి డి కి -------------200/-రూ.
18 సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపు పొందినవి:-
సహ చట్టం,సెక్షన్ 8 మేరకు దేశ భద్రత,సమగ్రతకు ముప్పు వాటిల్లె,ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే,పొరుగు దేశాలతో మైత్రి చెడిపోయే,చట్ట సభల హక్కులకు భంగం కల్గే సందర్భలలో ఈ చట్టం వర్తించదు.
19. భద్రతా,నిఘా సంస్థలకు మినహాయింపు ఉంది-
సహ చట్టం,సెక్షన్ 24 మేరకు దేశ భద్రత,నిఘా సంస్థలైన ఇంటెలిజెన్స్ బ్యూరో,రెవెన్యూ ఇంటెలిజెన్స్,రా(క్యాభినేట్ సెక్రటేరియట్ రీసెర్చ్&అనాలసిస్ వింగ్),కేంద్ర రిజర్వు పోలీస్ దళం,సరిహద్దు భద్రత బలగం,కేంద్ర పారిశ్రామిక భద్రత దళం,జాతీయ రక్షక దళం,ఇండియన్-టిబెట్ సరిహద్దు బలగం,అస్సాం రైపిల్ ఫోర్స్,ఏన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్,సిఐడి-అండమాన్ నికోబార్,స్పెషల్ బ్రాంచ్ సిఐడి-లక్యదీప్,ఏరోనాటికల్స్ రీసెర్చ్ కేంద్రం లాంటిికి మినహాయింపు వుంది.అయీతే ఇందులో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనకు సంబందించిన సమాచారం తీసుకోవచ్చు.
20.ఒక సంస్థకు సంబందం కానిదైతే సంబందిత సంస్థకు పంపాలి::-
సహచట్టం,సెక్షన్6(3) మేరకు దరకాస్తుదారుడు కోరిన సమాచారం ఒక సంస్థకు (కార్యాలయానికి)చెందినది కానట్టఐతే సదరు పిఐఓ సంబందిత సంస్ధకు పంపాలి.దరకాస్తు అందిన "5" రోజుల్లోపు పంపి విషయం దరకాస్తుదారుడికి చెప్పాలి. అంటే::-
21. చట్టం పరదిలోకి వచ్చే సంస్థలు:
సహ చట్టం, సెక్షన్2(h) మేరకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు&సెక్షన్ 2(h)(2)ప్రకారం ప్రభుత్వాల నుండి ప్రత్యక్షంగా,పరోక్షంగా,నిధులు,రాయితీలు,భూకేటాయింపులు పొందిన ప్రయీవేటుసంస్థలు కూడా అదికార యంత్రాంగాల క్రిందకు వస్తాయి.
22. దరకాస్తుదారు కోరిన రూపంలోనే సమాచారం ఇవ్వాలి:-
సహ చట్టం,సెక్షన్ 7(9) మేరకు ఎక్కువ ఆర్థిక వనరులు ఖర్చైయ్యే,రికార్డు భద్రత ప్రమాదంలో పడుతున్న సంధర్భంలో తప్పా దరఖాస్తుదారు కోరిన రూపంలో సమాచారం ఇవ్వాలి.
23.దరకాస్తుదారుడి పై చర్యకు అవకాశం లేదు::-
సహ చట్టం,సెక్షన్ 21ప్రకారం ,ఈ చట్టం క్రింద రూపొందిన నిబంధనల మేరకు మంచి చేస్తున్నామని నమ్మకంతో ఎవరు ఏమి చేసిన, వారిపై ఎటువంటి ధావాలు వేయడం, న్యాయవిచారణ చేయడం,చట్టపరమైన చర్యకు తీసుకోవడం కుదరదు...
24.సహ కమీషన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఏ న్యాయ స్థానానికి లేదు::-
సహ చట్టం,సెక్షన్ 23మేరకు కమిషన్ జారీచేసిన ఆదేశాలపై దావాను వేయడం,ఇతర విచారణను ఏ న్యాయస్థానం చేపట్ట కూడదు.ప్రశ్నించకూడదు.
25.దరఖాస్తుదారు పరిహారం పొందొచ్చు:
నిర్దేశిత గడువులో సమాచారం దొరకనప్పుడు కమిషన్కు వెళ్లాల్సి వస్తే సహ చట్టం సెక్షన్19(8)(బి) ప్రకారం పరిహారం పొందవచ్చు.
26.సహ చట్టం ప్రచార భాద్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలది::-
సహ చట్టం తాలూకా ప్రయోజనాలను ప్రజలకు అందించి వారిలో అవగాహన కల్పించే భాద్యత సహ చట్టం సెక్షన్ 26 మేరకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల విధి.....
సమాచార హక్కు ను గురి౦చి తరచుగా అడిగే ప్రశ్నలు
సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చింది. కేంద్ర , రాష్ట్ర పభుత్వాల పాలనకు ఒక పార దర్శకత, జవాబుదారీ తనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించినది. రెండు ప్రభుత్వాల పని తీరుకి సబంధించిన సమాచారం దేశ ప్రజలందరికి అందుబాటులో వుంచడానికి ఇది కృషి చేస్తుంది.
2. పబ్లిక్ ఆధారిటీలు అ౦టే ఎవరు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాసనాల ద్వారా గాని , రాజ్యాంగంలో చేసిన ఏర్పాటు వల్ల గాని, స్వంతంగా పాలనా నిర్వహణ ఏర్పాటు చేసుకునే సంస్థలు పబ్లిక్ అధారిటి అంటారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ అధికారం కింద పనిచేస్తున్న సంస్థలు, ప్రభుత్వ స్వంత సంస్థలు –ఇవి కూడా పబ్లిక్ అధారిటిల కిందే వస్తాయి. ప్రభుత్వం చేసే చాలినంత ఆర్ధిక సహాయం వల్ల నడిచే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి.
3.కోరిన సమాచారాన్ని ఎవరు అందిస్తారు?
సమాచార ఇవ్వడ౦ కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సమాచార అధికారి ప్రతి పబ్లిక్ సంస్థ లోను నియమించబడతారు.వారు తప్పనిసరిగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి. ఆర్.టి. ఐ. దరఖాస్తులు కూడా వీరిని అడ్రస్ చేసి పంపాలి.సబ్ డివిజినల్ స్థాయిలో అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వుంటారు. వీరు తమకు చేరిన దరఖాస్తులను , అప్పీల్స్ ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరుకు పంపుతారు.
4.సమాచార కమిషనుకు రాసే దరఖాస్తు, పబ్లిక్ అథారిటికి మీరు రాసే దాని కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది?
సమాచార హక్కు చట్టం ప్రకారం ఇతర దరఖాస్తుల మాదిరి కాకుండా ఇక్కడికి సమాచారాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులకు, అప్పీళ్ళకు తప్పనిసరిగా స్పందించి,పరిమిత సమయంలో అందించాల్సి వుంటుంది.
అలా జరగని పక్షంలో ఆ అధికారిపై చట్ట ప్రకారం శిక్ష విధించ వచ్చు. అంతే కాదు, అతనిపై క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు.
ఆర్.టి.ఐ. నుపయోగించి, పొందగల సమాచారం పరిధి ఎంతో విశాలమైంది. ఈ చట్టం ప్రకారం, పార్లమెంటుకు కానీ, రాష్ట్ర శాసన సభకు కానీ సమర్పించే ఏ సమాచారమైనా ప్రజలు ఆర్.టి.ఐ. ద్వారా పొంద వచ్చు.
ప్రజలు తాము కోరుతున్న సమాచారానికి కారణం కానీ, తమ వ్యక్తిగత వివరాలు కానీ,ఒక్క కాంటాక్టు అడ్రసు తప్ప, అధికారికి చెప్పాల్సిన పనిలేదు.
5.సమాచార హక్కు ను కోరుతున్న దరఖాస్తు ఇన్ని పదాల లోనే వుండాలని నిబంధన ఏమయినా వుందా?
ఔను. ఆర్.టి ఐ అప్లికేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామాతో కలిపి, 500 పదాలకు మించి వుండరాదు. అయితే అప్లికేషనుకు అనుబంధం వుంటే అది లెక్కలోకి రాదు. అయినాకానీ , పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు..
6. సమాచార హక్కు చట్టం ప్రకారం నేను సమాచారం పొందాలంటే ఏం చెయ్యాలి?
నిర్దేశించిన రుసుము చెల్లించి,సంబంధిత పబ్లిక్ అధారిటి యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరిట, దరఖాస్తు చేయాలి. ఆ అధికారికి మీరు అడుగుతున్న సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇక్కడ అవసరం లేదు.ఒకవేళ మీరు దరఖాస్తు రాయలేని నిరక్షరాస్యులు అయినట్టయితే , మీకు దరఖాస్తు రాసి పెట్టడానికి ఎవరినాయినా సూచించే బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తీసుకుంటారు.
7. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి?
సమాచార హక్కు చట్టం కింద ఈ క్రింది విషయాలు మీరు పొందవచ్చు.
డాక్యుమెంట్స్, రికార్డ్స్, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు. సలహాలు, పత్రికా ప్రకటనలు, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, రిపోర్టులు, పేపర్స్, సర్క్యులర్స్, శాంపిల్స్, మోడల్స్
ఎలెక్ట్రానిక్ ఫారంలో వున్న డేటా, డాక్యుమెంటు ఒరిజినల్ కాపీ,
మైక్రోఫిల్మ్, ఇమేజ్ రూపంలో వున్న మైక్రో ఫిల్మ్
8. ఏ ఏ విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు ?
ఈ క్రింది విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు.
భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాలకు భంగం కలిగించే సమాచారం
దేశ భద్రత, వ్యూహాత్మక , వైజ్ణానిక, ఆర్ధిక ప్రయోజనాలపై , విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే సమాచారం, హింసను ప్రేరేపించే సమాచారం
ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదయినా న్యాయస్థానం లేక ట్రిబ్యూనల్ ఆదేశించి వున్న పక్షంలో అలాంటి సమాచారం ,
సమాచార వెల్లడి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనుకుంటే ఆ సమాచారం
సమాచార వెల్లడి పార్లమెంట్ , రాష్ట్ర శాసన సభ హక్కులను ఉల్లంఘించేదయితే అలాంటి సమాచారం
వాణిజ్య పరమయిన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగేటట్లయిటే అలాంటి సమాచారం . అయితే, అలా వెల్లడి చెయ్యడం వల్ల ప్రజలకుఎక్కువ మేలు కలుగుతుందంటే ,ఆ సమాచారం ఇవ్వవచ్చు.
ఉద్యోగ సంబంధ రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో వున్న సమాచారం విశాల ప్రజాప్రయోజనాల రీత్యా వెల్లడి చేయాల్సిన అవసరం వుందని సంబంధిత అధికారి భావిస్తే దాన్ని ప్రకటించవచ్చు.
ఏదయినా విదేశ ప్రభుత్వం నుంచి అంది,గోప్యంగా ఉంచాల్సిన సమాచారం
సమాచార వెల్లడి వల్ల ఒక వ్యక్తికి ప్రాణ హాని కానీ, ప్రమాదం కలుగుతుందనుకుంటే ఆ సమాచారం,
చట్టాల అమలుకోసం, భద్రతా ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన,లేక సహాయపడిన వారి గుర్తింపుకు దారితీసే సమాచారం
దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్తులను పట్టుకునేందుకు గానీ,వారిని శిక్షించేందుకు అవరోధాలు కలిగించే సమాచారం
ఏదైనా అంశాలపై మంత్రి మండలి నిర్ణాయక పత్రాలు,అవి బహిర్గతం చేసే దాకా ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని వెల్లడి చేయరాదు.
సమాచారం ప్రజా ప్రయోజనాలకు కాని, ప్రజా కార్యక్రమాలకు సంబంధంలేని, వ్యక్తిగత సమాచారం గోప్యతను వెల్లడి చేసే వివరాలు
9. సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి?
మీకు కావలసిన సమాచారాన్ని ఇంగ్లీషు, హిందీ లేక ఈ దరఖాస్తు పంపుతున్న మీ ప్రాంతంలోని అధికార భాష గ గుర్తించిన ప్రాంతీయ భాషలో గాని వుండవచ్చు.
10. నాకు కావలసిన సమాచారాన్ని నేను కాపీ చేయడం గాని, చూడడం కాని ఎలా చెయ్యాలి?
డాక్యుమెంట్స్ , మాన్యుస్క్రిప్టులు, మరియు రికార్డులు తనిఖీ చేయవచ్చు.
నోట్స్ తీసుకోవచ్చు., సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కాపీలు లేక వాటి అనుబంధ కాపీలు,
పదార్ధాల సర్టిఫైడ్ శాంపుల్స్ ,
సీడీ ల రూపంలో వున్న సమాచారం, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్స్, ప్రిట్ అవుట్స్
( కంప్యూటరులో వున్న సమాచారం), లేక ఇతర ఎలక్ట్రానిక్ రూపంలో వున్న సమాచారం
11. నాకు కావలసీనా సమాచారం అధికారులు ఏ రూపంలో ఇవ్వగలరు?
పబ్లిక్ సంస్థ వనరులలో వ్యత్యాసాలతో కూడిన మార్పులు జరగకపోతే, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు. ఆ డాక్యుమెంటుకు హాని లేని పక్షంలో , లబ్దిదారులు కోరిన విధంగా, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు .
12. ఆర్. టి. ఐ. అప్లికేషన్ నింపడానికి ఏదయినా ఖచ్చితమైన ఫార్మెట్ వుందా?
లేదు. సమాచారాన్ని కోరుతూ దాఖలు చేస్కునే దరఖాస్తు ఫారానికి ప్రత్యేకమయిన ఫార్మెట్ ఏమీ లేదు. కానీ దరఖాస్తు దారుడు ఈ క్రింది వివరాలు రాయాల్సి వుంటుంది.
దరఖాస్తు తేదీ.
సంబ౦ధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామా
దరఖాస్తుదారుని చిరునామా
కోరదల్చుకున్న సమాచారం( స్పష్టత కోసం నంబర్లవారీగా కానీ, టేబుల్ రూపంలో గానీ వుంటే మంచిది. దానికి ప్రతిస్పందనలు కూడా అదే రూపంలో వుంటాయి.)
కోరిన సమాచారం ఎలాంటి రూపంలో – ప్రింట్ అవుట్స్, సిడి , ఈ మైయిల్స్
చెల్లించాల్సిన రుసుము స్టాంపు రూపంలో అయితే అంటించండి
చెల్లింపు విధానం తెలపండి.
సంతకం
అనేక కే౦ద్ర, రాష్ట ప్రభుత్వ సంస్థలు శాంపిల్ ఫార్మేట్స్ ను రూపొందించాయి.పర్యావరణ , అడవుల మంత్రిత్వ శాఖల కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను http;//envfor.nic.in/sites/default/files/app_pro.pdf వెబ్ సైట్ లో చూడగలరు.
సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు కూడా ఒక దరఖాస్తు ఫార్మెట్ తయారు చేశారు. ఇది దరఖాస్తు సౌలభ్యం కోసం మాత్రమే తప్ప తప్పనిసరిగా పాటించితీరాలని నిబంధన ఏమీలేదు. ఈ ఫార్మెట్ లేదనే కారణం గా దరఖాస్తుని తిరస్కరించడానికి వీల్లేదు.
13. ఆన్ లైన్ ద్వారా సమాచారాన్ని ఫైల్ చేయవచ్చా?
అది పబ్లిక్ అధారిటి మిద ఆధార పడి వుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే సమా చార హక్కు http;//rtionline.gov.in/ పేరిట ఒక పోర్టల్ నూ రూపకల్పన చేసింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలపై మాత్రమే వినియోగదారుడు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాచార హక్కు గురించి వెబ్ సైట్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.
14. జవాబు పొందడానికి ఎంత సమయం పడుతుంది?
సమాచారం ఎవరయినా వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు
అవసరమయినది అయితే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు సమాచారం అందించాలి.
దరఖాస్తు చేరిన ౩౦ రోజులలోగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్
అధికారి సమాచారం అందించాలి. అప్లికేషన్ అసిస్టెంట్
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి ప౦పినట్టయితే అతను
సంబంధిత అధికారిని దాన్ని చేర్చి సమాచారం సేకరీంచే
నిమిత్తం మరొక 5రోజులు అవసరమవుతుంది. ఒకవేళ
ఆ సమాచారం ఎవరయినా వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు
అవసరమయినది అయితే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు సమాచారం అందించాలి.
15. సమాచార హక్కు దరఖాస్తు సరైన అధికారికి పంపకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తుందా?
మీ దరఖాస్తు సంబంధిత అధికారికి చేరకుండా మరొకరికి చేరినా కానీ, దాన్ని తిప్పి పంపంచడానికి వీల్లేదు. ఈ చట్టం పకారం దాన్ని అందుకున్న వ్యక్తి, లేక సంస్థ 5 రోజుల్లోగా నిర్దేశిత అధికారికి తిరిగి చేర్చితీరాలి.
16. సమాచారం తీసుకోవడానికి నేను ఏమయినా ఫీజు చెల్లించాలా.?
సమాచార హాక్కు కింద సమాచారం కోరుతూ పంపే అప్లికేషను ఒక కాపీ మీ దగ్గర అట్టిపెట్టు కొండి. అప్లికేషను రిజిష్టర్ పోస్టు అక్నాలేడ్జిమేంటలో పంపండిరాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ అథారిటి సమర్పించబోయే సమాచారానికి ఒక నియమిత ఫీజును నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆ మొత్తాన్ని రూ. 10 గా ప్రకటించింది.(ఈ పైన ఇచ్చిన పట్టికలోఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజు ఎంతెంత నిర్ణ యిన్చిందో, ఎలాఫీజు కట్టలో ఇవ్వడం జరిగింది.) ఒకవేళ దరఖాస్తు దారుడుదారిద్యరేఖ దిగువున వున్నా వాడితే,( ఫీజు చెల్లించలేనిపరిస్థితిలో) వుంటే దానికి సంబంధించిన గుర్తింపు కార్డునుసమర్పించాల్సి వుంటుంది.అప్లికేషను ఫీజు కాకుండా, కోరిన సమాచారాన్ని బట్టి వాటి ప్రి౦టవుట్స్ కి పేజీకి రూ.2 చొప్పున చెల్లించాలి. అదనపు చార్జీలు ఎవైన వుంటే, ఆఫీసరు తన జవాబులో తెలియజేస్తారు.ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు సమాచారం ఇవ్వడంలో 30 రోజులకంటే ఎక్కువ జాప్యం చేస్తే, అప్పుడు ఎటువంటి ఫీజు వసూలు చెయ్యకుండా ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి వుంటుంది.
17.ఆర్.టి.ఐ దరఖాస్తుకి స్పందన లేకపోతే ఏం చెయ్యాలి?
సమాచారం కోసం సమర్పించిన దరఖాస్తుకి సంబంధిత అధికారి నుంచి స్పందన లేకపోతే అప్పిలేట్ ఆధారిటీ కి అప్పీల్ చేసుకోవచ్చు. అన్ని పబ్లిక్ అథారిటిల తాలూకు అప్పిళ్ళను చూసేది అప్పలేట్ అధారిటి. మీ మొదటి అప్లికేషనుకు జవాబు రావాల్సిన తేది నుంచి 30 నుంచి 60 రోజుల వ్యవధిలోపల అప్పీలు చేసుకోవాలి.
18. నాకు చేరిన సమాచారం తప్పుగానో, అసంపూర్తిగానో వుంటే ఏం చెయ్యాలి?
ఇచ్చిన సమాచారం అవాస్తవంగానో , అసంపూర్తిగానో వుంటే అప్పిలేట్ ఆధారిటికి అప్పీల్ చేసుకోవాలి. సమాధానం చేరిన 30 రోజులలోపు అప్పీలుచేయాలి. సరైన కారణాలు వున్నప్పుడు అంతకంటే ఎక్కువ జాప్యం జరిగిన కూడా అప్పీలు అంగీకరిస్తారు.
19. సమాచారాన్ని నాకు ఇవ్వడానికి తిరస్కరించవచ్చా?
తిరస్కరించవచ్చు. కొన్ని సమాచార విషయాలు ఆర్.టి.ఐ. సహాయంతో అందరితో పంచుకునే వీలులేదు. అలాంటప్పుడు సంబంధిత అధికారులు మీ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. అయితే, ఆర్.టి.ఐ చట్టం కింద సదరు సమాచారం ఇవ్వ యోగ్యమైనదే అనిపిస్తే, మీరు అప్పీలు చెయ్యవచ్చు.
మీరు ఈ అప్పీలును మీకు జవాబు వచ్చిన 30 రోజుల లోగా చేసుకోవాలి.మీ అప్లికేషన్ తిరస్కరించినప్పుడు, దానికి కారణాలు, మీరు దానిపై ఎలా అప్పీలు చేసుకోవచ్చో, మీరు పంపాల్సిన అప్పలేట్ అధారిటి ,ఇవన్ని కూడా తిరస్కరిస్తున్న పబ్లిక్ అథారిటి ఇవ్వాల్సి వుంది.
20. అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం నాకు అసంతృగా వుందనిపిస్తే నేను ఏం చెయ్యాలి?
అలాంటప్పుడు, మీరు కేంద్ర సమాచార కమిషన్ కు లేదా, రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండో సారి అప్పీలు చేయవచ్చు. మీరు మొదట పంపిన అప్పీలుకు జావాబు ఇవ్వాల్సిన సమయం అయిన తరవాత 90 రోజులోగా రెండో అప్పీలు పంపుకోవాలి. లేదా, మొదటి అప్పీలుకు జావాబు వచ్చిన తరవాత 90 రోజులలోగా రెండో అప్పీలు పంపాలి. సరైన కారణం వున్నప్పుడు, ఈ సమయం దాటి పోయినా కూడా అప్పీలు అనుమతించబడుతుంది.
21.నేను కోరిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర సమాచార కమిషన్/కేంద్ర సమాచార కమిషన్ గాని నిర్ణిత సమయం లో ఇవ్వాలని వున్నదా?
అటువంటి సమయ నిబంధన ఏది లేదు.
22.కోరిన సమాచారం ఇవ్వని అధికారి పై ఎం చర్యలు తీసుకుంటారు
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ క్రింద వివరించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అతను దరఖాస్తూ స్వీకరించే వరకు,లేదా, సమాచారం ఇచ్చే వరకు కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ రోజుకు రు .250 లు చొప్పున పెనాల్టి విధించ వచ్చు. గరిష్టంగా రు.25,000లు వరకు పెనాల్టి వేయవచ్చు.
___ సరైన కారణం లేకుండానే ఆర్.టి.ఐ. దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించడం
___ నిర్ణయించబడిన సమయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం
___ సమాచారం కావాలని ఆలస్యంగా ఇవ్వడం
___ తెలిసి కూడా తప్పుడు సమాచారం/అసంపూర్తి సమాచారం/తప్పు దోవ పట్టించే
సమాచారం ఇవ్వడం
___ అడిగిన సమాచారాన్ని అసలు లేకుండా చెయ్యడం,
___ సమాచారం ఇవ్వడానికి ఏదో విధంగా అడ్డుపడడం
సమాచార హక్కు చట్టం (ఆర్ టిఐ) కింద సమాచారం కోరే వారికి కొన్ని సూచనలు:-
2. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు సంబంధించిన అంశాలు
a) 2005 సంవత్సర ఆర్ టిఐ చట్టం ప్రకారం ఏదైనా ఇతర ప్రభుత్వ శాఖకు చెందిన లేదా సంబంధిత శాఖ పరిధిలోని అంశంపై సమాచారం కోరినట్టయితే దరఖాస్తును ఆ శాఖకు బదిలీ చేస్తారు. ఈ కారణంగా దరఖాస్తుదారులు ఏ శాఖ నుండి సమాచారం కోరుతున్నారో ఆ మంత్రిత్వ శాఖ/విభాగం లోని ప్రజా సమాచార అధికారికే నేరుగా దరఖాస్తు చేసినట్టయితే వారి అభ్యర్థనలు సరైన సమయంలో పరిశీలనకు తీసుకునే వీలు ఉంటుంది. ఒక వేళ మంత్రిత్వ శాఖలు/విభాగాల విధుల కేటాయింపు విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే అప్పుడు దరఖాస్తుదారులు వారి దరఖాస్తులను నేరుగా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఎలకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్, 1961కు అనుగుణంగా సిపిఐఒ కు పంపవచ్చు.b) బహుళ శాఖలకు సంబంధించిన (ఉదాహరణ : ఒకటి కన్నా ఎక్కువ మంత్రిత్వ శాఖ/విభాగం) అంశాలపై దరఖాస్తులు వస్తే వాటిని ఆయా శాఖలకు బదిలీ చేసే అవకాశం ఉండదు. అలాంటి దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు ఉంటాయి.
3. రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యుటి) పాలన యంత్రాంగాలకు సంబంధించిన అంశాలు : రాష్ర్ట ప్రభుత్వాలు/ యుటి ల విధులకు సంబంధించిన అంశాలైతే దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఆయా రాష్ర్ట ప్రభుత్వం (ప్రభుత్వాలు)/ యుటి ల అధికార యంత్రాంగానికి పంపించుకోవాలి.
4. ఆయా రాష్ర్ట ప్రభుత్వాల పరిధిలోని కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల కు చెందిన ప్రభుత్వాధికారుల నుండి సమాచారం కోరుతున్నట్టయితే భారత ప్రభుత్వ వెబ్ డైరెక్టరీలో లభ్యమయ్యే ఆయా శాఖల వెబ్ సైట్ (వెబ్ సైట్ ల)కు దరఖాస్తులను పంపించాలి.
5. ప్రధాన మంత్రి కార్యాలయం రికార్డుల పరిధిలోకి రాని అంశాలపై సిపిఐఒ సమాచారాన్ని నిక్షిప్తం చేయదు. అలాగే దిగువ అంశాలకు చెందిన సమాచారాన్ని సిపిఐఒ అందించే అవకాశం ఉండదు.
a) ఏవో ఆధారాలు ఉన్నాయంటూ అనుమానాస్పద అంశాలపై కోరే సమాచారం;
b) కాల్పనిక అంశాలు;
c) ఏదో జరిగిందంటూ అభిభాష్యాలతో కూడిన అంశాలు;
d) దరఖాస్తుదారులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారం కోసం చేసే అభ్యర్థనలు;
e) ఇతర ప్రభుత్వాధికారి (ప్రభుత్వాధికారుల) పరిధిలోని అంశాలకు సంబంధించిన సమాచారం; లేదా
f) ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఇమ్మని అడగడం.
6. పిఎంఒ కు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన సమాచారం అంతా “సమాచార హక్కు” శీర్షిక కింద పిఎంఒ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. దరఖాస్తుదారులు ఆర్ టిఐ కోసం దరఖాస్తు చేసే ముందు ఆ వెబ్ సైట్ లోని సమాచారాన్ని సందర్శించడం వల్ల ఏ అంశాలు పరిశీలనార్హం అన్న దానిపై అవగాహన కలుగుతుంది.
విద్యాహక్కు చట్టం- 2009
పిల్లలు ఏ దేశానికైనా అతి ఉన్నతమైన వనరులు. వీరి భుజస్కంధాలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన భవిష్యత్తు ప్రతిక్షణం దివ్యకాంతులవలే వెలగాలంటే వారికి నాణ్యమైన విద్య ఎంతో అవసరం. దీన్ని గుర్తించిన పెద్దలు 1950, జనవరి 26 నుంచి అమలు పర్చిన రాజ్యాంగంలో అవసరమైన చట్టాలు రూపొందించారు.
రాజ్యాంగం 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలను ఆదేశిక సూత్రాలు అంటారు. దీనిలో 41వ నిబంధన విద్య, 45వ నిబంధన ఉచిత, నిర్బంధ విద్య, 45వ నిబంధన ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యాభివృద్ధి, దీనికి తోడు ప్రాథమిక హక్కుల్లో భాగంగా 29వ, 30వ అధికరణలు మైనారిటీల విద్యాహక్కును తెలియజేస్తున్నాయి.
దేశం స్వాతంత్య్రం పొందిన దాదాపు అరవై ఏండ్లకు దేశ చరిత్రలో విద్యకి సంబంధించిన కీలక చట్టం అమల్లోకి వచ్చింది. అదే విద్యాహక్కు చట్టం- 2009.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009, ఆగస్టు 26న విద్యాహక్కు బిల్లు ఆమోదం పొందింది. 2009, ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సంతకాలతో గెజిట్ రూపంలో ఆవిర్భవించింది. ఈ బిల్లు బాలల మౌలిక హక్కు (అధికరణ 21)లో సవరణ చేయడంతో రూపొందింది. దీన్నే 21A అధికరణ అంటారు.
రాజ్యాంగంలో ఈ సవరణను 86వ సవరణగా పిలుస్తారు. ఈ బిల్లు 2010, ఏప్రిల్ 1 నుంచి పూర్తి ప్రభావంతో చట్టబద్ధమై అమల్లోకి వచ్చింది. విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం.
విద్యాహక్కు చట్టం- 2009 లేదా రైట్ టు ఎడ్యుకేషన్- 2009 (ఆర్టీఈ-2009) సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టాలవలే ఇది అమలవుతుంది. ఎలాంటి రుసుము లేకుండా (ఉచితంగా) 6 నుంచి 14 ఏండ్ల వయస్సుగల బాలలందరూ తప్పనిసరిగా (నిర్బంధంగా) పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాల మీద ఉంటుంది.
పాఠశాలల్లో చేరని లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించడం విద్యాహక్కు చట్టం ముఖ్య ఉద్దేశం. పాఠశాల నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వ పాఠశాల చదువులకు దూరంగా ఉన్న బాలబాలికలందరినీ గుర్తించి పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాలి.
ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్ను నిరాకరించడానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25 శాతం సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి. ఈ చట్టంలో 7 అధ్యాయాలు (38 సెక్షన్లు), ఒక షెడ్యూల్ ఉన్నాయి.
1వ అధ్యాయం
సెక్షన్ 1
-పార్లమెంట్ చేసిన ఈ దిగువ చట్టం-2009, ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొందింది.
-ఈ చట్టాన్ని ఉచిత, నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టం, 2009, ఆగస్టు అని కూడా పిలువవచ్చు.
-ఒక్క జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి తప్ప ఇది దేశమంతటికీ వర్తిస్తుంది.
-కేంద్రప్రభుత్వం అధికారిక రాజపత్రంలో ప్రకటించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
సెక్షన్-2
-ప్రభుత్వం (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) క్యాపిటేషన్ రుసుము (బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో ఇచ్చే చందా, విరాళం, చెల్లింపులు మొదలైనవి), బాలలు (6 నుంచి 14 ఏండ్ల వయస్సుగల పిల్లలు), ప్రాథమిక విద్య (1 నుంచి 8వ తరగతి), స్థానిక ప్రభుత్వం (బడి మీద పాలనకు సంబంధించి అధికారాలు కలిగి ఉన్న నగర పాలక సంస్థ లేదా నగర పాలక సంఘం లేదా జిల్లా పరిషత్ లేదా నగర పంచాయతీ లేదా పంచాయతీ లేదా ఏ ఇతర పేర్లతో పిలిచే సంస్థలు), బడి (ప్రాథమిక విద్యతో గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా స్థానిక బడులు, ప్రైవేటు బడులు, ఎయిడెడ్ బడులు, ప్రత్యేక వర్గీకరణకు చెందిన బడులు) పదాల నిర్వచనాలు.
2వ అధ్యాయం
సెక్షన్-3
-6 నుంచి 14ఏండ్లు గల పిల్లలందరికీ పరిసర ప్రాంత పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసేవరకు ఉచిత, నిర్బంధ హక్కు ఉంటుంది.
సెక్షన్-4
-6 ఏండ్లు నిండిన పిల్లలను స్కూల్లో చేర్చకపోయినా లేదా చేర్చిన తర్వాత ప్రాథమిక విద్య పూర్తిచేయలేకపోయినా వారిని వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
సెక్షన్-5
-వేరే స్కూల్లో ప్రవేశం పొందడానికి అప్పటివరకు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్చార్జి వెంటనే బదిలీ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. బదిలీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో ఆలస్యమైతే ప్రవేశం నిరాకరించడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఇట్టి పరిస్థితుల్లో కారకులైన వారిపై (ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్చార్జి) ఉద్యోగపరమైన చర్యలు తీసుకుంటారు.
3వ అధ్యాయం
సెక్షన్-6
-ఈ చట్టం అమలు నుంచి 3 ఏండ్లలోపు బడిలేని చోట బడిని స్థాపించాలి.
సెక్షన్-7
-ఈ చట్టంలో పేర్కొన్న నియమాలను పూర్తిచేయడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాధ్యులవుతాయి.
సెక్షన్-8
-సంబంధిత ప్రభుత్వాలు పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందజేస్తాయి.
సెక్షన్-9
-ప్రతి స్థానిక ప్రభుత్వం పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యని అందజేస్తాయి.
సెక్షన్-10
-తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలకు సమీప బడిలో ప్రవేశం కల్పిస్తారు.
సెక్షన్-11
-3 ఏండ్ల వయస్సుగల పిల్లలను ప్రాథమిక విద్యలో ప్రవేశం కోసం (6 ఏండ్లు నిండేవరకు) సంసిద్ధులను చేయడానికి పూర్వ బాల్యపు సంరక్షణ కేంద్రాల్లో (ఈసీఈ) చేర్పించే బాధ్యత సంబంధిత ప్రభుత్వాలదవుతుంది.
4వ అధ్యాయం
సెక్షన్-12
-ఈ చట్టంలో పేర్కొన్న పాఠశాలలు పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమూహాలకు చెందిన పిల్లలకు ఒకటో తరగతిలోని విద్యార్థుల సంఖ్యలో 25 శాతం ఇచ్చి ప్రాథమిక విద్యను పూర్తిచేసే వరకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి.
సెక్షన్-13
-పిల్లల ప్రవేశానికి ఎలాంటి రుసుము (క్యాపిటేషన్ ఫీజు) వసూలు చేయకూడదు. ఎంపిక పరీక్షలు నిర్వహించకూడదు.
-గమనిక: క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే దానికి పదిరెట్లు జరిమానాకు శిక్షార్హులు. అదే విధంగా పిల్లలను ఎంపిక విధానానికి గురిచేస్తే మొదటిసారి తప్పునకు రూ. 25,000, ఆ తర్వాత ప్రతిసారి తప్పునకు రూ. 50,000 జరిమానా విధిస్తారు.
సెక్షన్-14
-ప్రాథమిక విద్యలో ప్రవేశాల కోసం పిల్లల జన్మ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించాలి.
-గమనిక: పిల్లల వయస్సుకి సంబంధించి ధ్రువీకరణపత్రంలేని సందర్భంలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు.
సెక్షన్-15
-విద్యా ఏడాది ప్రారంభ తేదీ నుంచి సిఫారసు చేసిన గడువు పెంచినకాలంలో పిల్లలను పాఠశాలలో చేర్చుకోవాలి.
సెక్షన్-16
-పాఠశాలలో ప్రవేశం పొందిన పిల్లలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్లీ కొనసాగించకూడదు. బడి నుంచి తీసివేయకూడదు.
సెక్షన్-17
-పిల్లలను శారీరక శిక్షకు, మానసిక వేధింపులకు గురిచేయకూడదు.
సెక్షన్-18
-గుర్తింపు లేకుండా స్కూళ్లు నిర్వహించడం లేదా స్థాపించకూడదు.
-గమనిక: గుర్తింపులేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై రూ. లక్ష జరిమానా విధిస్తారు. అప్పటికీ మారని పక్షంలో జరిమానా విధించిన రోజు నుంచి ప్రతిరోజూ రూ. 10 వేల జరిమానా విధిస్తారు.
సెక్షన్-19
-షెడ్యూల్లో పేర్కొన్న నియమాలు, ప్రామాణికాలు పూర్తిచేయకుండా సెక్షన్-18 కింద ఏ పాఠశాలను ఏర్పాటుచేయకూడదు. గుర్తింపును ఇవ్వకూడదు.
సెక్షన్-20
-కేంద్రప్రభుత్వం, విజ్ఞప్తి ద్వారా, షెడ్యూల్లో ఏదైనా ప్రామాణికాన్ని జోడించే లేదా తీసివేసే పూర్తి హక్కులు కలిగి ఉంటుంది.
సెక్షన్-21
-ఎలాంటి ఆర్థిక సహాయం పొందని పాఠశాలలు (ప్రైవేట్) తప్ప మిగతా అన్ని రకాల పాఠశాలలు స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో, ఆ పాఠశాలలో చదువుతున్న బాలల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, ఉపాధ్యాయులతో పాఠశాల యాజమాన్య సంఘాన్ని (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఏర్పాటు చేయాలి.
సెక్షన్-22
-ఈ సెక్షన్ ప్రకారం ఏర్పాటైన ప్రతి పాఠశాల ఎస్ఎంసీ సిఫారసు చేసిన విధంగా నడుచుకోవాలి.
సెక్షన్-23
-కేంద్రప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకడమిక్ సంస్థ నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్న ఏ వ్యక్తి అయినా ఉపాధ్యాయుడిగా నియామకానికి అర్హులు (ఉదా: టెట్).
సెక్షన్-24
-ఈ సెక్షన్ ఆధారంగా నియామకమైన ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరుకావాలి. పాఠ్యాంశాలను పూర్తిచేయాలి. పిల్లల సామర్థ్యాన్ని అంచనావేసి దానికనుగుణంగా అవసరమైతే అదనపు బోధన అందించాలి.