సామూహిక బీమా పథకం ( Group Insurance Scheme)
1.1.11.1984 నుండి అమలులోనికి వచ్చింది.
2.ఉద్యోగులందరికీ ఈ పథకం తప్పనిసరి.
3. రద్దు చేయబడిన కుటుంబ సంక్షేమ పథకానికి జమ అయిన సొమ్ము ఉద్యోగ విరమణ సమయంలో గాని,మరణించి నపుడుగాని చెల్లిస్తారు.
4 ఈ పథకంలో సభ్యుడు కాగానే నామినేషన్ ఫారాలు పూర్తిచేసి అటెస్టు చేయించి సర్వీసు పుస్తకంలో
అతికించాలి.
5 నవంబరు నెల తర్వాత ఉద్యోగంలో చేరినవారు, తర్వాత వచ్చే నవంబరు నుండి స్కీములో సభ్యులుగా చేరుతారు. అయితే స్కీములో సభ్యులుగా చేరే వరకు ప్రతినెల, ప్రతి యూనిట్ కు రూ. 5 వంతున చెల్లించాలి. భీమా కవరేజి కొరకు యిది చేర్చారు.
6 జి.వో.ఎం.ఎస్.నెం. 312 ఫైనాన్స్ ప్రకారం ప్రతి రూ. 10కు రూ. 3.125 భీమాకు రూ. 6.875 పొదుపు నిధికి జమ చేయబడును.
7. మరణించినపుడు భీమా డబ్బు +పొదుపు నిల్వను వడ్డీతో సహా చెల్లిస్తారు.
8. ప్రమోషన్ వల్లగాని యితర కారణాల వల్లగాని వేతన స్కేలు పెరిగితే అందుకు అనుగుణమైన గ్రూప్ కు సంబంధించిన చందా చెల్లించాలి. అయితే ఈ మారిన గ్రూప్కు సంబంధించిన చందా ఈ పథకం వచ్చే వార్షికము నుండి చెల్లించాలి. అంతవరకుపాత చెల్లింపే కొనసాగాలి.
9. ఈ పథకాన్ని అమలు పరచవలసిన బాధ్యత అధి కార్లదే. జీతం నుండి రికవరీ చేసే బాధ్యత డ్రాయింగ్ అధికార్లది.
10. ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవుపైన వెళితే ఈ ఉద్యోగి చెలించాల్సిన శెలవు కాలపు మొత్తమును తిరిగి జాయిన్ అయిన తర్వాత వడ్డీతో సహా మూడు వాయిదాల్లో చెల్లించాలి. ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవు కాలంలోమర శిస్తే అకాలపుచందాడబ్బు వడ్డీతోసహా మినహాయించుకొనిమిగతా మొత్తం కుటుంబ సభ్యుల కిస్తారు.
11. ఈ నిధి నుండి అడ్వాన్సులు అప్పులు యివ్వరు. అయితే గృహ నిర్మాణ పథకాలకు సభ్యులకు మేలు చేకూర్చు యితర పథకాలకు ఈ నిల్వలను ఉపయోగిస్తారు.
12. పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు తప్ప మిగతా ఉపాధ్యాయులందరికీ రిటైర్ మెంట్ నాడే జి.ఐ.ఎస్.
మొత్తం చెల్లించాలి.
13. ఈ క్రింది విధంగా గ్రూపులు చేయబడ్డారు. ఒక యూనిట్ సొమ్ము రూ. 15.లు
14 వడ్డీ రేటు :
1-4-2011, తేది 20-11-2011 వరకు 8 శాతం. 1-12-2011నుండి 8.6% వడ్డీ రేట్లు పెంచబడినవి.
(G.O. 2425, Fin., Dt. 10-05-2012)
15.2012-13 ఆర్థిక సంవత్సరానికి జి. ఐ. ఎస్ లెక్కింపు వివరించబడినది.
(G.O. 148, Fin., Dt. 0606-2012)